పాల్గొన్న పదహారో వార్డు యువకులు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని మాజీ కౌన్సిలర్ షేక్ జహీర్ కలిశారు. ఈ సందర్భంగా పదహారో వార్డు జాకీర్ హుస్సేన్ నగర్కు చెందిన యువకులు కూడా హాజరయ్యారు. వార్డు పరిధిలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించినట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ భేటీలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి