Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:55 PM

ర్యాలమడుగులో సంక్షేమ కార్యక్రమాలు – ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం,సీసీ రోడ్డు శంకుస్థాపన

ర్యాలమడుగులో సంక్షేమ కార్యక్రమాలు – ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం,సీసీ రోడ్డు శంకుస్థాపన

ర్యాలమడుగులో సంక్షేమ కార్యక్రమాలు – ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం,సీసీ రోడ్డు శంకుస్థాపన
February 04, 2026 01:24 PM 253 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోనిజాంపేట్ మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన లక్ష్మి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశోత్సవ కార్యక్రమంలో నేడు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదలకు స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నామని తెలిపారు.పేదలు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఆయన అన్నారు.ర్యాలమడుగు గ్రామానికి చెందిన లక్ష్మికి ఇందిరమ్మ ఇంటి మంజూరు జరిగి, నేడు గృహప్రవేశం జరగడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇసుకను ఉచితంగా అందించడంతో పాటు రుణ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని, అర్హులైన పేదలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు,ర్యాలమడుగు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News