ర్యాలమడుగులో సంక్షేమ కార్యక్రమాలు – ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం,సీసీ రోడ్డు శంకుస్థాపన
ర్యాలమడుగులో సంక్షేమ కార్యక్రమాలు – ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం,సీసీ రోడ్డు శంకుస్థాపన
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోనిజాంపేట్ మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన లక్ష్మి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశోత్సవ కార్యక్రమంలో నేడు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదలకు స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నామని తెలిపారు.పేదలు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఆయన అన్నారు.ర్యాలమడుగు గ్రామానికి చెందిన లక్ష్మికి ఇందిరమ్మ ఇంటి మంజూరు జరిగి, నేడు గృహప్రవేశం జరగడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇసుకను ఉచితంగా అందించడంతో పాటు రుణ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని, అర్హులైన పేదలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు,ర్యాలమడుగు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి