రథసప్తమి వేడుకలు ఘనంగా
రథసప్తమి వేడుకలు ఘనంగా
Biksham Goud
పిల్లలమరి శివాలయంలో సూర్యనారాయణ స్వామి ప్రత్యేక పూజలు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
రథసప్తమి పండుగ సందర్భంగా చారిత్రాత్మకమైన మన పిల్లలమరి శివాలయంలోని నవగ్రహ మండపంలో వేంచేసియున్న శ్రీ ఉషా – చాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఉదయం వేళ స్వామివారికి అభిషేకము, పుష్పార్చన, నిరాజన, మంత్రపుష్పం ఘనంగా జరిపారు. అనంతరం విశేష అలంకరణలో స్వామివారి దివ్య దర్శనం కల్పించారు. సూర్యదేవుని దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. వేదమంత్రాల మంత్రోచ్ఛారణల నడుమ సాగిన పూజలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.పండుగ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రథసప్తమి వేడుకలు మన పిల్లలమరి శివాలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపి, గ్రామమంతా భక్తిశ్రద్ధలతో పులకించిపోయింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి