Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

రాష్ట్రంలో రోడ్డు భద్రతకు పోలీసుల ముందడుగు – ప్రజల్లో అవగాహన

రాష్ట్రంలో రోడ్డు భద్రతకు పోలీసుల ముందడుగు – ప్రజల్లో అవగాహన

రాష్ట్రంలో రోడ్డు భద్రతకు పోలీసుల ముందడుగు – ప్రజల్లో అవగాహన
January 20, 2026 07:44 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల పరిధిలోని సింగితం గ్రామ చౌరస్తాలో మంగళవారం జిల్లా ఎస్పీ పంకజ్ పారితోష్, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు ఆదేశాల మేరకు రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్ మరియు అతని సిబ్బంది ఆధ్వర్యంలో “రాజ్య రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం” విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ప్రజల్లో రోడ్డు నియమాలపై అవగాహన కల్పించడం. కార్యక్రమంలో విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు మరియు సాధారణ ప్రజలకు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాల గురించీ అవగాహన కల్పించబడింది. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం తప్పనిసరి, సీట్ బెల్ట్ ఉపయోగించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదు, డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకూడదు, వేగ నియంత్రణ పాటించాలి, పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలి వంటి విషయాలపై వివరించారు.అలాగే, మైనర్ పిల్లలకు వాహనాలను అందించడం ప్రమాదకరమని తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చట్టపరమైన చర్యలకు మాత్రమే కాకుండా ప్రాణనష్టానికి కూడా దారి తీస్తుందని అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమం ద్వారా “రోడ్డు భద్రత – మన అందరి బాధ్యత” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చారు. రోడ్డు భద్రత నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి, విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News