Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:53 PM

రాష్ట్రంలో రోడ్డు భద్రతకు పోలీసుల ముందడుగు – ప్రజల్లో అవగాహన

రాష్ట్రంలో రోడ్డు భద్రతకు పోలీసుల ముందడుగు – ప్రజల్లో అవగాహన

రాష్ట్రంలో రోడ్డు భద్రతకు పోలీసుల ముందడుగు – ప్రజల్లో అవగాహన
January 20, 2026 07:44 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల పరిధిలోని సింగితం గ్రామ చౌరస్తాలో మంగళవారం జిల్లా ఎస్పీ పంకజ్ పారితోష్, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు ఆదేశాల మేరకు రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్ మరియు అతని సిబ్బంది ఆధ్వర్యంలో “రాజ్య రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం” విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ప్రజల్లో రోడ్డు నియమాలపై అవగాహన కల్పించడం. కార్యక్రమంలో విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు మరియు సాధారణ ప్రజలకు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాల గురించీ అవగాహన కల్పించబడింది. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం తప్పనిసరి, సీట్ బెల్ట్ ఉపయోగించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదు, డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకూడదు, వేగ నియంత్రణ పాటించాలి, పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలి వంటి విషయాలపై వివరించారు.అలాగే, మైనర్ పిల్లలకు వాహనాలను అందించడం ప్రమాదకరమని తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చట్టపరమైన చర్యలకు మాత్రమే కాకుండా ప్రాణనష్టానికి కూడా దారి తీస్తుందని అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమం ద్వారా “రోడ్డు భద్రత – మన అందరి బాధ్యత” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చారు. రోడ్డు భద్రత నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి, విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News