Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:28 PM

రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం–2020ను తక్షణమే అమలు చేయాలి:తపస్ రాష్ట్ర కోశాధికారి

రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం–2020ను తక్షణమే అమలు చేయాలి:తపస్ రాష్ట్ర కోశాధికారి

రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం–2020ను తక్షణమే అమలు చేయాలి:తపస్ రాష్ట్ర కోశాధికారి
February 01, 2026 06:55 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) సంగారెడ్డి జిల్లా శాఖ జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం సంగారెడ్డి పట్టణంలోని మాధవ సదన్‌లో జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేశ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల వల్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్ర ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను వెంటనే ప్రకటించాలని, ఉద్యోగుల సహకార పింఛన్ పథకానికి సంబంధించిన బకాయిలను గ్రీన్ ఛానల్ ద్వారా ఒకే నెలలో పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం–2020ను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని, దీనివల్ల విద్యా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని తెలిపారు.ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేసి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఈ న్యాయమైన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు సంఘం పూర్తిగా సిద్ధంగా ఉందని సమావేశం హెచ్చరించింది.ఈ సమావేశం సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సాగిందని, రానున్న రోజుల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కుల సాధన కోసం తపస్ మరింత దృఢంగా పోరాడుతుందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేశ్, రాష్ట్ర కార్యదర్శి రమేష్, రాష్ట్ర సేవా విభాగం సహ సమన్వయకర్త చంద్రశేఖర్ ఆచార్య, రాష్ట్ర సాంస్కృతిక మరియు క్రీడా విభాగం సహ బాధ్యుడు బస్వరాజ్, రాష్ట్ర ఆడిట్ విభాగం సహ సమన్వయకర్త విజయ్ కుమార్, రాష్ట్ర మీడియా విభాగం సహ సమన్వయకర్త నర్సింలు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, తపస్ జిల్లా బాధ్యులు, జిల్లాలోని వివిధ విభాగాల అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు తపస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News