రాష్ట్ర స్థాయి పదవికి అలిగే జీవన్ – ఘన సన్మానించిన:వై పండరి
రాష్ట్ర స్థాయి పదవికి అలిగే జీవన్ – ఘన సన్మానించిన:వై పండరి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలంలోని బెల్లపూర్ గ్రామానికి చెందిన అలిగే జీవన్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ భవన్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి, డివిజన్ అధ్యక్షుడు రవీందర్, మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు విశ్వనాథ్, బి.ఎస్.పి ఇంచార్జ్ ఎం పండరి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంజయ్ రామ్, డకూర్ శ్రీకాంత్, ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ నర్సింలు తదితరులు కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అలిగే జీవన్ సామాజిక సేవలో చురుకుగా పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని, రాష్ట్ర స్థాయిలో పదవి రావడం ఆయన కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం అలిగే జీవన్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి