Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:49 PM

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు
February 09, 2026 05:38 PM 355 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

మునుగోడు గడ్డ మరోసారి తెలంగాణ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఘాటైన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి.“తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు మునుగోడు నుంచే మొదలవుతుంది. మునుగోడు ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రాన్ని శాసించే రోజు తప్పక వస్తుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పటికీ సామాన్య ప్రజల సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారమవలేదని రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. “రాష్ట్రం వచ్చింది… కానీ ప్రజల కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. రైతు, నిరుద్యోగి, పేదవాడి జీవితంలో ఆశించిన మార్పు కనిపించడం లేదు” అంటూ పాలక వ్యవస్థపై పరోక్ష విమర్శలు చేశారు.మునుగోడు ఉపఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాల దిశ మారిన తీరు రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఇప్పుడు మరోసారి అదే తరహా రాజకీయ మలుపు మునుగోడు నుంచి ప్రారంభమవుతుందా అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.రాబోయే రోజుల్లో మునుగోడు రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో కీలక మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలను కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్ష శిబిరాల్లో కలకలం రేపుతున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News