Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:24 PM

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు
February 09, 2026 05:38 PM 364 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునుగోడు గడ్డ మరోసారి తెలంగాణ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఘాటైన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి.“తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు మునుగోడు నుంచే మొదలవుతుంది. మునుగోడు ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రాన్ని శాసించే రోజు తప్పక వస్తుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పటికీ సామాన్య ప్రజల సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారమవలేదని రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. “రాష్ట్రం వచ్చింది… కానీ ప్రజల కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. రైతు, నిరుద్యోగి, పేదవాడి జీవితంలో ఆశించిన మార్పు కనిపించడం లేదు” అంటూ పాలక వ్యవస్థపై పరోక్ష విమర్శలు చేశారు.మునుగోడు ఉపఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాల దిశ మారిన తీరు రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఇప్పుడు మరోసారి అదే తరహా రాజకీయ మలుపు మునుగోడు నుంచి ప్రారంభమవుతుందా అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.రాబోయే రోజుల్లో మునుగోడు రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో కీలక మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలను కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్ష శిబిరాల్లో కలకలం రేపుతున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News