Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:09 PM

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు
February 09, 2026 05:38 PM 356 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునుగోడు గడ్డ మరోసారి తెలంగాణ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఘాటైన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి.“తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు మునుగోడు నుంచే మొదలవుతుంది. మునుగోడు ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రాన్ని శాసించే రోజు తప్పక వస్తుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పటికీ సామాన్య ప్రజల సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారమవలేదని రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. “రాష్ట్రం వచ్చింది… కానీ ప్రజల కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. రైతు, నిరుద్యోగి, పేదవాడి జీవితంలో ఆశించిన మార్పు కనిపించడం లేదు” అంటూ పాలక వ్యవస్థపై పరోక్ష విమర్శలు చేశారు.మునుగోడు ఉపఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాల దిశ మారిన తీరు రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఇప్పుడు మరోసారి అదే తరహా రాజకీయ మలుపు మునుగోడు నుంచి ప్రారంభమవుతుందా అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.రాబోయే రోజుల్లో మునుగోడు రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో కీలక మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలను కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్ష శిబిరాల్లో కలకలం రేపుతున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News