రాష్ట్ర మంత్రి, ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసిన జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్
రాష్ట్ర మంత్రి, ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసిన జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్
Sthanikam District Staff Reporter krishna
జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ యునూస్ శనివారం హైదరాబాద్లో పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు.మొదటగా రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనర్సింహను వారి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్కుమార్ శెట్కార్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.తరువాత టీమ్రీస్ సంస్థ చైర్మన్ ఫహీం ఖురేషీ, రాష్ట్ర సెట్విన్ సంస్థ చైర్మన్ ఎన్. గిరిధర్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డా. సిద్దం ఉజ్వల్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఇటీవల మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ యునూస్కు నాయకులు అభినందనలు తెలియజేస్తూ, పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టి జహీరాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రంగా అరుణ్కుమార్, సీనియర్ నాయకుడు పట్లోళ్ల శ్రీకాంత్రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి