Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:06 PM

రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎంబడి దత్తు రెడ్డి

రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎంబడి దత్తు రెడ్డి

రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎంబడి దత్తు రెడ్డి
February 20, 2026 06:48 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాల్గవ మహాసభలు నిజామాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రతినిధులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు హాజరై సంస్థ భవిష్యత్ దిశ, విద్యా విధానాలు, విద్యార్థుల సమస్యలపై విస్తృతంగా చర్చలు జరిపారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా నుండి దత్తు రెడ్డి గారిని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నాపై రాష్ట్ర నాయకత్వం మరియు ప్రతినిధులు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనం. జిల్లాలో విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయడంలో, విద్యార్థుల హక్కుల సాధనలో దత్తు రెడ్డి గారు చూపుతున్న చురుకుదనం, నిబద్ధత, పోరాట పటిమకు గుర్తింపుగా ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా దత్తు రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎన్నుకున్న రాష్ట్ర నాయకత్వానికి మరియు మహాసభ ప్రతినిధులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ బాధ్యతను ఒక గౌరవంగా కాకుండా, మరింత బాధ్యతగా స్వీకరిస్తున్నాను. సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు — ఫీజుల భారం, హాస్టల్ సౌకర్యాల లోపం, స్కాలర్‌షిప్ సమస్యలు, ఉపాధ్యాయుల కొరత, ప్రైవేటీకరణ ప్రభావం వంటి అంశాలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తాము. విద్య హక్కు — అమ్మకం కాదు అనే నినాదంతో ముందుకు సాగుతాము” అని పేర్కొన్నారు.అలాగే, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు కల్పించడం, ప్రతి విద్యార్థి స్వరాన్ని ప్రభుత్వానికి వినిపించేలా ఉద్యమాలను మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.ఈ ఎన్నికతో సంగారెడ్డి జిల్లాలో ఏఐఎస్ఎఫ్ కార్యకలాపాలు మరింత చురుకుగా మారనున్నాయని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు గౌరవం తీసుకువచ్చిన దత్తు రెడ్డి గారికి జిల్లా నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News