రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
Vikram
అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం మట్టపల్లి పుణ్యక్షేత్రానికి మంగళవారం రానున్న నేపథ్యంలో, గవర్నర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం మట్టపల్లిలో గవర్నర్ రాకకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పర్యవేక్షించారు. గవర్నర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను, ఆలయ ధర్మకర్తలను సూచించారు. పోలీస్ శాఖ హెలిప్యాడ్ ఏర్పాట్లు, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ పండితులు, ధర్మకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే. నరసింహ, అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు, విజయ్ కుమార్, ఆలయ ఈవో జ్యోతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి