Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:53 AM

రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
January 21, 2026 07:11 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram

అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం మట్టపల్లి పుణ్యక్షేత్రానికి మంగళవారం రానున్న నేపథ్యంలో, గవర్నర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం మట్టపల్లిలో గవర్నర్ రాకకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పర్యవేక్షించారు. గవర్నర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను, ఆలయ ధర్మకర్తలను సూచించారు. పోలీస్ శాఖ హెలిప్యాడ్ ఏర్పాట్లు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ పండితులు, ధర్మకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే. నరసింహ, అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు, విజయ్ కుమార్, ఆలయ ఈవో జ్యోతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News