Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:38 AM

రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
21-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం మట్టపల్లి పుణ్యక్షేత్రానికి మంగళవారం రానున్న నేపథ్యంలో, గవర్నర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం మట్టపల్లిలో గవర్నర్ రాకకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పర్యవేక్షించారు. గవర్నర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను, ఆలయ ధర్మకర్తలను సూచించారు. పోలీస్ శాఖ హెలిప్యాడ్ ఏర్పాట్లు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ పండితులు, ధర్మకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే. నరసింహ, అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు, విజయ్ కుమార్, ఆలయ ఈవో జ్యోతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Article Image

అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం మట్టపల్లి పుణ్యక్షేత్రానికి మంగళవారం రానున్న నేపథ్యంలో, గవర్నర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం మట్టపల్లిలో గవర్నర్ రాకకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పర్యవేక్షించారు. గవర్నర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను, ఆలయ ధర్మకర్తలను సూచించారు. పోలీస్ శాఖ హెలిప్యాడ్ ఏర్పాట్లు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ పండితులు, ధర్మకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే. నరసింహ, అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు, విజయ్ కుమార్, ఆలయ ఈవో జ్యోతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News