Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:16 PM

రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
January 21, 2026 07:11 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం మట్టపల్లి పుణ్యక్షేత్రానికి మంగళవారం రానున్న నేపథ్యంలో, గవర్నర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం మట్టపల్లిలో గవర్నర్ రాకకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పర్యవేక్షించారు. గవర్నర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను, ఆలయ ధర్మకర్తలను సూచించారు. పోలీస్ శాఖ హెలిప్యాడ్ ఏర్పాట్లు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ పండితులు, ధర్మకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే. నరసింహ, అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు, విజయ్ కుమార్, ఆలయ ఈవో జ్యోతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News