రోడ్డు భద్రత పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
రోడ్డు భద్రత పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
Krishna
మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్
ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి:రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ , అల్లాదుర్గం సర్కిల్ సీఐ రేణుక రెడ్డి అన్నారు. బుధవారం అల్లాదుర్గం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డిఎస్పి మాట్లాడుతూ రోడ్డు యాక్సిడెంట్ ల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే సైబర్ క్రైమ్ లో ప్రజలు ఎలా మోసపోతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.ద్విచక్ర వాహనము నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ లేనిదే కారు నడపకూడదని మద్యం సేవించి వాహనములు నడపకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని వాహనం లకు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించరు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్తయ్య, ఎస్సై శంకర్ , ఏఎస్ఐ గాలయ్య, కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి