రాంనగర్ యూత్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు ఘన సన్మానం
రాంనగర్ యూత్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు ఘన సన్మానం
K.RAVI
యూత్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందనలు
అభివృద్ధికి కట్టుబాటు కావాలని ఆకాంక్ష
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన నూతన కౌన్సిలర్లకు రాంనగర్ యూత్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘన సన్మానం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు బొదుల యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్, 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్లను పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి గెలుపొందిన కౌన్సిలర్లలో మెజారిటీ సభ్యులు రాంనగర్ కాలనీ 13వ వార్డుకు చెందినవారే కావడం గర్వకారణమన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన 13వ వార్డును కౌన్సిలర్ల సహకారంతో సమగ్రంగా అభివృద్ధి పరచాలని కోరారు. భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజాసేవలో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు మాజీ ఉప సర్పంచ్ పాక పద్మ, మాజీ వార్డు సభ్యుడు జటంగి కృష్ణ, బొమ్మిరెడ్డి సంజీవరెడ్డి, యూత్ గౌరవ అధ్యక్షుడు చింతల బాబు, బోదుల లింగస్వామి, శ్యామల లింగస్వామి, ఎర్రసాని శేఖర్, ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కనకమోని శ్రీనివాస్, జటంగి రవి, సభ్యులు జటంగి రాజు, కోనేటి కృష్ణ, వర్కల కుమార్, తొర్పునూరి బాబు, మార్గం నర్సింహా, కళ్లెం నాగరాజు, సంగీశెట్టి రమేష్, గుండ్ల నాగరాజు, యూత్ సభ్యులు కత్తుల రవి, బోదుల నరేష్, కడెం వెంకటేష్, ఊధరి స్వామీనాధం, బయ్యా సంపత్, చింతల హేమంత్, మహిళలు తొర్పునూరి బాలమ్మ, బయ్యా కవిత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి