Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:53 AM

రంగనాథ స్వామి దేవాలయంలో తులసి మొక్కల పంపిణీ

రంగనాథ స్వామి దేవాలయంలో తులసి మొక్కల పంపిణీ

రంగనాథ స్వామి దేవాలయంలో తులసి మొక్కల పంపిణీ
December 30, 2025 01:04 PM 337 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

అందోల్, స్థానికం ప్రతినిధి:

ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సంతరించుకొని అందోల్ మండలంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అందోల్ గ్రామంలో కొలువైన శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయంలో స్వామివారి దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు దర్శనానికై క్యూ లైన్ లో వేచి ఉన్నారు. దేవాలయానికి విచ్చేసిన భక్తులకు అక్సాన్ పల్లి గ్రామానికి చెందిన ఆరేటి అరుణ-సుదర్శన్ రెడ్డి, మరియు ఆరేటి స్వప్న-సురేందర్ రెడ్డి దంపతులు తులసి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంట తులసి మొక్క ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని అనేకమైనటువంటి ఔషధ గుణాలను కలిగి ఉందని ప్రతి ఇంటా తులసి మొక్క నాటాడం ద్వారా అష్టైశ్వర్యాలు పొంది ఆరోగ్యంతో జీవిస్తారనే సదుద్దేశంతో తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News