రంగనాథ స్వామి దేవాలయంలో తులసి మొక్కల పంపిణీ
రంగనాథ స్వామి దేవాలయంలో తులసి మొక్కల పంపిణీ
Sandeep journalist
అందోల్, స్థానికం ప్రతినిధి:
ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సంతరించుకొని అందోల్ మండలంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అందోల్ గ్రామంలో కొలువైన శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయంలో స్వామివారి దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు దర్శనానికై క్యూ లైన్ లో వేచి ఉన్నారు. దేవాలయానికి విచ్చేసిన భక్తులకు అక్సాన్ పల్లి గ్రామానికి చెందిన ఆరేటి అరుణ-సుదర్శన్ రెడ్డి, మరియు ఆరేటి స్వప్న-సురేందర్ రెడ్డి దంపతులు తులసి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంట తులసి మొక్క ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని అనేకమైనటువంటి ఔషధ గుణాలను కలిగి ఉందని ప్రతి ఇంటా తులసి మొక్క నాటాడం ద్వారా అష్టైశ్వర్యాలు పొంది ఆరోగ్యంతో జీవిస్తారనే సదుద్దేశంతో తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి