రామన్నపేట మండలంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటన. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.
రామన్నపేట మండలంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటన. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.
Editor Desk
రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎంఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సోమవారం ప్రారంభించారు. ముందుగా మండల కేంద్రంలో రైతుల సౌకర్యార్థం శుద్ధి చేసిన తాగునీటి ప్లాంట్ను ప్రారంభించి, అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
తదుపరి జనంపల్లి, ఇస్కిల్ల, కక్కిరేణి, ఎన్నారం, కుంకుడుపాముల, తుర్కపల్లి, సూరారం, బాచ్చుపల, పల్లివాడ, మునిపంపుల, దుబ్బాక, నీర్నేముల, సిరిపురం, వెల్లంకి, సర్నేనిగూడెం గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
వెల్లంకి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహంలో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాల్ బహదూర్, ఎంపీడీవో ఏ రాములు, వ్యవసాయ అధికారి ఎజాజ్ అలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ భూక్యా నాయక్, వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, ఏపీఎం ఎస్.కె. జానీమియా, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి