రామన్నపేట విద్యార్థులకు ఏఐపై అవగాహన
రామన్నపేట విద్యార్థులకు ఏఐపై అవగాహన
Editor Desk
రామన్నపేట : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు ఆరవ రోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి మంచి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఐబీఎం కన్సల్టెన్సీలకు చెందిన సాయి రాఘవేంద్ర, లక్ష్మీ ప్రసన్న, సోమనాథ్ విద్యార్థులకు ఏఐ వినియోగం, భవిష్యత్ అవకాశాలపై వివరించారు.
కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్. వెంకట్ గౌడ్, ఎం. అనిత, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, టి. శ్రీనివాస్, జె. నరేశ్, రవి, ఆంజనేయులు, కార్యాలయ సిబ్బంది శ్రీదేవి, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి