స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగాదేవి స్వామి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 221 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన స్వామికి గ్రామ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో BRSతో పాటు ఇతర అభ్యర్థులను పక్కనబెట్టి ఓటర్లు స్వామికి పట్టం కట్టడం గమనార్హం. గతంలో స్వామి తండ్రి నరసింహ రెండు సార్లు సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓటమి పాలైనా, ఆయన కలను ఇప్పుడు తనయుడు నెరవేర్చాడని గ్రామంలో చర్చ నడుస్తోంది.
తండ్రి ఆశయాన్ని సాకారం చేసిన స్వామిని స్థానిక గ్రామస్థులు, స్నేహితులు హర్షాతిరేకాలతో అభినందిస్తున్నారు. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి గ్రామస్థాయిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి