PRINT TIME: February 23, 2026 11:29 PM
రామన్నపేట: నేడే పోలింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
రామన్నపేట: నేడే పోలింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
December 14, 2025 07:18 AM
87 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
సర్పంచుల కోసం స్థానిక లీడర్ల ఆరాటం
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రామన్నపేట మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆదివారం జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో 2 జీపీలతో పాటు 232 వార్డుల్లో 29 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
మిగిలిన స్థానాలకు గాను సర్పంచ్ పదవుల కోసం 59 మంది, వార్డు సభ్యులుగా 495 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 45,358 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సర్పంచ్, వార్డు స్థానాల కలిపి మొత్తం 554 మంది అభ్యర్థుల భవితవ్యంపై ఆదివారం సాయంత్రం లేదా రాత్రికి తెరపడనుంది.
ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల తీర్పు ఎటువైపు మొగ్గు చూపుతుందోనన్న ఆసక్తితో మండల ప్రజలు ఎదురుచూస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి