Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:27 AM

రామన్నపేట: నేడే పోలింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

రామన్నపేట: నేడే పోలింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

రామన్నపేట: నేడే  పోలింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
December 14, 2025 07:18 AM 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
సర్పంచుల కోసం స్థానిక లీడర్ల ఆరాటం
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రామన్నపేట మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆదివారం జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో 2 జీపీలతో పాటు 232 వార్డుల్లో 29 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన స్థానాలకు గాను సర్పంచ్ పదవుల కోసం 59 మంది, వార్డు సభ్యులుగా 495 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 45,358 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సర్పంచ్, వార్డు స్థానాల కలిపి మొత్తం 554 మంది అభ్యర్థుల భవితవ్యంపై ఆదివారం సాయంత్రం లేదా రాత్రికి తెరపడనుంది.

ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల తీర్పు ఎటువైపు మొగ్గు చూపుతుందోనన్న ఆసక్తితో మండల ప్రజలు ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News