రామన్నపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం
రామన్నపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని బుధవారం సామాజిక శాస్త్రాల విభాగాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రహత్ ఖానం మాట్లాడుతూ, “ప్రపంచ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 10ని మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛగా తమ హక్కులను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. అదే సమయంలో ఇతరుల హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని పేర్కొన్నారు. అంతేకాక, మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలను అమలు చేస్తోందని ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. అనిత, టి. శ్రీనివాసులు, అలాగే అధ్యాపకులు డాక్టర్ కిషన్, డాక్టర్ లక్ష్మినీలిమ, డాక్టర్ సునీత, డాక్టర్ బ్రహ్మం, డాక్టర్ రాచమల్ల శ్రీను, జి. నరేష్, ఏ. ఆంజనేయులు, రాధిక తదితర అధ్యాపక–అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి