Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:14 AM

రామన్నపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం

రామన్నపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం

రామన్నపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం
December 10, 2025 04:42 PM 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని బుధవారం సామాజిక శాస్త్రాల విభాగాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రహత్ ఖానం మాట్లాడుతూ, “ప్రపంచ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 10ని మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛగా తమ హక్కులను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. అదే సమయంలో ఇతరుల హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని పేర్కొన్నారు. అంతేకాక, మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలను అమలు చేస్తోందని ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఎన్ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. అనిత, టి. శ్రీనివాసులు, అలాగే అధ్యాపకులు డాక్టర్ కిషన్, డాక్టర్ లక్ష్మినీలిమ, డాక్టర్ సునీత, డాక్టర్ బ్రహ్మం, డాక్టర్ రాచమల్ల శ్రీను, జి. నరేష్, ఏ. ఆంజనేయులు, రాధిక తదితర అధ్యాపక–అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News