రమణక్కపేటలో సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం
రమణక్కపేటలో సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం
GADDAM JAGANMOHAN REDDY
సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి రాంప్రసాద్ అధ్యక్షతన ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేట లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ అటవీ భూముల సాగుదారులకు సాగు హక్కులు కల్పించి, పట్టాలు మంజూరు చేయాలని, ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే జరిపి నా తర్వాత ఫారెస్ట్ కానీ 420 ఎకరాలు భూమికి పట్టాలు మంజూరు చేయాలని, 1980 కి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫారెస్ట్ కన్షావేషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ ప్రకారం సాగుదారులకు హక్కులు కల్పించాలని, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధా ప్రకారం కొనసాగించాలని, విబి గ్రామ్ జి పథకాన్ని రద్దు చేయాలని, బంజర భూములకు పట్టాలు మంజూరు చేయాలని, ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టులో క్లాయిములు దాఖలు చేయడం జరిగిందని, కలెక్టర్,జాయింట్ కలెక్టర్,సబ్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులతో ముఖాముఖి సమీక్ష ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలన చేసి పట్టాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అటవీ భూములలో సాగు దారులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలన్నారు.కౌలు రైతులకు హామీలేని రుణాలు మంజూరు చేయాలన్నారు .ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టపరిహారం అందించాలన్నారు. మార్చి రెండవ తేదీన చలో కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరపత్రాలు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పల్లెపాము భవాని,కొత్తపల్లి రాంప్రసాద్, దారా బేబీ షాలిని, నందిపాము రాణి,కొత్తపల్లి నాగ మల్లికార్జునరావు, కొత్తపల్లి ప్రభాకర్ రావు, మాదాసు పుల్లారావు,ముష్టిబండ కామా చారి,కొడపాక రామకృష్ణ చారి, చలకంటే వెంకటేశ్వరరావు , మాటూరి శ్రీనివాసరావు,మాదాసు పుల్లారావు, చిట్టిపాటి పుల్లారావు, కొత్తపల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి