Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:44 AM

రమణక్కపేటలో సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం

రమణక్కపేటలో సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం

రమణక్కపేటలో సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం
February 16, 2026 07:09 PM 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి రాంప్రసాద్ అధ్యక్షతన ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేట లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ అటవీ భూముల సాగుదారులకు సాగు హక్కులు కల్పించి, పట్టాలు మంజూరు చేయాలని, ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే జరిపి నా తర్వాత ఫారెస్ట్ కానీ 420 ఎకరాలు భూమికి పట్టాలు మంజూరు చేయాలని, 1980 కి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫారెస్ట్ కన్షావేషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ ప్రకారం సాగుదారులకు హక్కులు కల్పించాలని, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధా ప్రకారం కొనసాగించాలని, విబి గ్రామ్ జి పథకాన్ని రద్దు చేయాలని, బంజర భూములకు పట్టాలు మంజూరు చేయాలని, ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టులో క్లాయిములు దాఖలు చేయడం జరిగిందని, కలెక్టర్,జాయింట్ కలెక్టర్,సబ్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులతో ముఖాముఖి సమీక్ష ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలన చేసి పట్టాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అటవీ భూములలో సాగు దారులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలన్నారు.కౌలు రైతులకు హామీలేని రుణాలు మంజూరు చేయాలన్నారు .ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టపరిహారం అందించాలన్నారు. మార్చి రెండవ తేదీన చలో కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరపత్రాలు విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో పల్లెపాము భవాని,కొత్తపల్లి రాంప్రసాద్, దారా బేబీ షాలిని, నందిపాము రాణి,కొత్తపల్లి నాగ మల్లికార్జునరావు, కొత్తపల్లి ప్రభాకర్ రావు, మాదాసు పుల్లారావు,ముష్టిబండ కామా చారి,కొడపాక రామకృష్ణ చారి, చలకంటే వెంకటేశ్వరరావు , మాటూరి శ్రీనివాసరావు,మాదాసు పుల్లారావు, చిట్టిపాటి పుల్లారావు, కొత్తపల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News