Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:59 PM

రమణక్కపేట లో మోదీ విధానాలకు వ్యతిరేకంగా సమరానికి పిలుపు

రమణక్కపేట లో మోదీ విధానాలకు వ్యతిరేకంగా సమరానికి పిలుపు

రమణక్కపేట లో మోదీ విధానాలకు వ్యతిరేకంగా సమరానికి పిలుపు
February 07, 2026 05:59 PM 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం అఖిలభారత కిసాన్ మహాసభ అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రమణక్కపేట గ్రామంలో కమిటీ సమావేశం జరిగింది. మోదీ కార్మిక కర్షక రైతు మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించడం జరిగింది. ఈనెల 12వ తేదీన అఖిలభారత దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని, 19వ తేదీన ముసునూరు మండల కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని నిర్ణయించారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని వి బి గ్రామ్ జీ పథకం పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ పంచాయతీ కార్యాలయ కార్యదర్శి వారికి అర్జీ ఇవ్వటం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ నాలుగు లేబర్ కోట్ల రద్దకై, ఉపాధి హామీ చట్టం రక్షణకై, హైర్ & ఫైర్ విధానం రద్దుకై, పంటల మద్దతు ధరలకై, ఎనిమిది గంటల పని విధానం అమలకై, 2025 విద్యుత్ సవరణ బిల్లు రద్దుకై,ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకై ,కనీస వేతనాల పెంపుకై, మతోన్మాద కార్పోరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. రాష్ట్రంలో మోడీ విధానాలకు డూ డూ బసవన్నలా తలాడిస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలనలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పి వారి పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె పాము భవాని, నంది పాము రాణి, వేముల మహాలక్ష్మి ,ఆముదాల పార్వతి, ఆముదాల జయమ్మ, ఆముదాల చినబాబు ,వేముల చంటి, ఉయ్యూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News