రమణక్కపేట లో మోదీ విధానాలకు వ్యతిరేకంగా సమరానికి పిలుపు
రమణక్కపేట లో మోదీ విధానాలకు వ్యతిరేకంగా సమరానికి పిలుపు
GADDAM JAGANMOHAN REDDY
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం అఖిలభారత కిసాన్ మహాసభ అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రమణక్కపేట గ్రామంలో కమిటీ సమావేశం జరిగింది. మోదీ కార్మిక కర్షక రైతు మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించడం జరిగింది. ఈనెల 12వ తేదీన అఖిలభారత దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని, 19వ తేదీన ముసునూరు మండల కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని నిర్ణయించారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని వి బి గ్రామ్ జీ పథకం పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ పంచాయతీ కార్యాలయ కార్యదర్శి వారికి అర్జీ ఇవ్వటం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ నాలుగు లేబర్ కోట్ల రద్దకై, ఉపాధి హామీ చట్టం రక్షణకై, హైర్ & ఫైర్ విధానం రద్దుకై, పంటల మద్దతు ధరలకై, ఎనిమిది గంటల పని విధానం అమలకై, 2025 విద్యుత్ సవరణ బిల్లు రద్దుకై,ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకై ,కనీస వేతనాల పెంపుకై, మతోన్మాద కార్పోరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. రాష్ట్రంలో మోడీ విధానాలకు డూ డూ బసవన్నలా తలాడిస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలనలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పి వారి పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె పాము భవాని, నంది పాము రాణి, వేముల మహాలక్ష్మి ,ఆముదాల పార్వతి, ఆముదాల జయమ్మ, ఆముదాల చినబాబు ,వేముల చంటి, ఉయ్యూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి