రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే కార్యక్రమం లో డి హరినాథ్ మాట్లాడుతూ
రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే కార్యక్రమం లో డి హరినాథ్ మాట్లాడుతూ
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే నినాదంతో తిరుపతయ్య కుమారుడు కాంతారావు ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రథమ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి ప్రోత్సాహకరంగా నగదు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ రమణక్కపేట ఉపాధ్యాయ వర్గం మండలంలోననూ జిల్లాలోనూ విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు . ఆటలలో పాటలలో కూడా గుర్తింపు తెచ్చుకున్న విద్యార్థులను వారి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని కాంతారావు గారు సత్కరించారు.విద్యా వైద్యం ప్రైవేటీకరణ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. విద్యార్థులను కేవలం పుస్తక పురుగులు వలే కాకుండా సామాజిక స్పృహ పెంచేందుకు ఉపాధ్యాయ వర్గం తల్లిదండ్రులుదోహదపడాలని హరినాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నేత చలసాని రామారావు ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య వేములబక్కయ్య, ముసునూరు ఎంపీపీ జడ్పిటిసి తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి