చిత్రపటానికి నివాళులర్పించిన చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్యకు ఆద్యుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. శనివారం పురపాలక కార్యాలయంలో ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను తొలగించి, వెనుకబడిన వర్గాలకు విద్యాఫలాలు అందేలా ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి