Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 07:07 PM

చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
April 11, 2026 05:13 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద గత కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 45-50 ఏళ్లు) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.​పోలీసుల కథనం ప్రకారం:ఆందోల్ మైసమ్మ ఆలయ జూనియర్ అసిస్టెంట్ అలుగుబెల్లి సత్తిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్ అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా మల్కాపురంలో కాగితాలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటూ, గత మూడేళ్లుగా ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. తనకు ఎవరూ లేరని గతంలో అతను స్థానికులకు తెలిపాడు. ​శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆలయం పక్కనే ఉన్న కిరాణా షాపు హాల్‌లో శంకర్ అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది, పరిశీలించగా అతను అప్పటికే మృతి చెంది ఉన్నాడు. తీవ్రమైన ఎండలు, అనారోగ్యం, సరైన ఆహారం లేక ఆరోగ్యం క్షీణించి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.​గుర్తు పట్టేందుకు వయస్సు: 45 నుండి 50 ఏళ్ల మధ్య.​ఎత్తు: సుమారు 5.5 అడుగులు.​రంగు: చామన ఛాయ.​జుట్టు: నలుపు, తెలుపు రంగులో ఉంది.​దుస్తులు: పింక్ కలర్ చొక్కా, బ్లూ కలర్ గ్రీన్ లైన్స్ ఉన్న లుంగీ ధరించి ఉన్నాడు.

​మృతుని వివరాలు తెలిసిన వారు చౌటుప్పల్ పోలీసు స్టేషన్‌లో లేదా ఎస్‌ఐ ఉపేందర్ రెడ్డి (సెల్: 8712553699) నంబర్‌కు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News