Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 03:29 AM

చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
April 11, 2026 05:13 PM 155 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద గత కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 45-50 ఏళ్లు) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.​పోలీసుల కథనం ప్రకారం:ఆందోల్ మైసమ్మ ఆలయ జూనియర్ అసిస్టెంట్ అలుగుబెల్లి సత్తిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్ అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా మల్కాపురంలో కాగితాలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటూ, గత మూడేళ్లుగా ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. తనకు ఎవరూ లేరని గతంలో అతను స్థానికులకు తెలిపాడు. ​శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆలయం పక్కనే ఉన్న కిరాణా షాపు హాల్‌లో శంకర్ అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది, పరిశీలించగా అతను అప్పటికే మృతి చెంది ఉన్నాడు. తీవ్రమైన ఎండలు, అనారోగ్యం, సరైన ఆహారం లేక ఆరోగ్యం క్షీణించి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.​గుర్తు పట్టేందుకు వయస్సు: 45 నుండి 50 ఏళ్ల మధ్య.​ఎత్తు: సుమారు 5.5 అడుగులు.​రంగు: చామన ఛాయ.​జుట్టు: నలుపు, తెలుపు రంగులో ఉంది.​దుస్తులు: పింక్ కలర్ చొక్కా, బ్లూ కలర్ గ్రీన్ లైన్స్ ఉన్న లుంగీ ధరించి ఉన్నాడు.

​మృతుని వివరాలు తెలిసిన వారు చౌటుప్పల్ పోలీసు స్టేషన్‌లో లేదా ఎస్‌ఐ ఉపేందర్ రెడ్డి (సెల్: 8712553699) నంబర్‌కు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News