చౌటుప్పల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
చౌటుప్పల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
K.RAVI
ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద గత కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 45-50 ఏళ్లు) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం:ఆందోల్ మైసమ్మ ఆలయ జూనియర్ అసిస్టెంట్ అలుగుబెల్లి సత్తిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్ అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా మల్కాపురంలో కాగితాలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటూ, గత మూడేళ్లుగా ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. తనకు ఎవరూ లేరని గతంలో అతను స్థానికులకు తెలిపాడు. శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆలయం పక్కనే ఉన్న కిరాణా షాపు హాల్లో శంకర్ అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది, పరిశీలించగా అతను అప్పటికే మృతి చెంది ఉన్నాడు. తీవ్రమైన ఎండలు, అనారోగ్యం, సరైన ఆహారం లేక ఆరోగ్యం క్షీణించి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.గుర్తు పట్టేందుకు వయస్సు: 45 నుండి 50 ఏళ్ల మధ్య.ఎత్తు: సుమారు 5.5 అడుగులు.రంగు: చామన ఛాయ.జుట్టు: నలుపు, తెలుపు రంగులో ఉంది.దుస్తులు: పింక్ కలర్ చొక్కా, బ్లూ కలర్ గ్రీన్ లైన్స్ ఉన్న లుంగీ ధరించి ఉన్నాడు.
మృతుని వివరాలు తెలిసిన వారు చౌటుప్పల్ పోలీసు స్టేషన్లో లేదా ఎస్ఐ ఉపేందర్ రెడ్డి (సెల్: 8712553699) నంబర్కు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి