Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్యావరణంపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన జ్యోతుల మహోత్సవంతో మార్మోగిన ఈదులబలాపురం – రామనామంతో భక్తుల ప్రదక్షిణ TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 05:44 PM

రక్తదానం మహాదానం – నారాయణఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం

రక్తదానం మహాదానం – నారాయణఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం

రక్తదానం మహాదానం – నారాయణఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం
March 27, 2026 03:36 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రక్త నిల్వలు కొరత ఏర్పడిన నేపథ్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణాలను కాపాడే మహోన్నత సేవ అని,ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి దాతకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు,మ్యాన్స్ క్లబ్ టీమ్ మరియు ఆసుపత్రి సిబ్బందిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.ఈ శిబిరంలో మొత్తం 52 మంది దాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో సాయి సంగమేశ్వర సెట్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజ్ కుమార్, చంద్రశేఖర్ ఆచార్య,వెంకట్ రావు, ఆసుపత్రికి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్,తదితర సభ్యులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News