రక్తదానం మహాదానం – నారాయణఖేడ్లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం
రక్తదానం మహాదానం – నారాయణఖేడ్లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రక్త నిల్వలు కొరత ఏర్పడిన నేపథ్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణాలను కాపాడే మహోన్నత సేవ అని,ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి దాతకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు,మ్యాన్స్ క్లబ్ టీమ్ మరియు ఆసుపత్రి సిబ్బందిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.ఈ శిబిరంలో మొత్తం 52 మంది దాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో సాయి సంగమేశ్వర సెట్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజ్ కుమార్, చంద్రశేఖర్ ఆచార్య,వెంకట్ రావు, ఆసుపత్రికి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్,తదితర సభ్యులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి