రాజీవ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
రాజీవ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
K.RAVI
రూ.40 వేల నగదు పంపిణీ
పేదలకు అండగా ఉంటామని ట్రస్ట్ ప్రతినిధుల హామీ
రాజీవ్ స్మారక ఫౌండేషన్ (ట్రస్ట్) ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో ఆదివారం పలువురు లబ్ధిదారులకు రూ.40 వేల నగదు పంపిణీ చేశారు.నేలపట్ల గ్రామానికి చెందిన పాలమాకుల యాదయ్యకు రూ.15,000, తంగడపల్లి గ్రామానికి చెందిన ఉదరి క్రిష్టయ్యకు రూ.15,000, చౌటుప్పల్కు చెందిన కేశనాచారి కుటుంబానికి రూ.10,000 వేల చొప్పున ఆర్థిక సహాయం అందచేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ కోశాధికారి ఖయ్యూం, కార్యదర్శి నల్ల నరసింహ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ఫౌండేషన్ లక్ష్యమని, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నేలపట్ల గ్రామం పాలమాకుల నర్సింహా, గుండు మల్లయ్య, కోడెం రాములు, దుర్గం శ్రీనివాస్, తడక ఆంజనేయులు, తంగడపల్లి గ్రామం ఉబ్బు వెంకటయ్య, బత్తుల లింగస్వామి, బొజ్జ బుచ్చయ్య, ఊందరి సురేష్, ఊదరి రామచంద్రం, బెదరం లింగస్వామి, దాసరి చంద్రయ్య, మహ్మద్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి