రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి.
రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి.
Editor Desk
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా రామన్నపేట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి జమీరుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో సమాచార సాంకేతిక రంగానికి రాజీవ్ గాంధీ పునాది వేశారని కొనియాడారు. యువత రాజకీయాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించిన దూరదృష్టి గల నాయకుడని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు.
కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కొత్తపెళ్లి అబ్రహం కుమార్, గుండాల నరసింహ, నంద్యాల భిక్షం రెడ్డి, గంగుల రాజిరెడ్డి, పున్న జగన్మోహన్, గుత్తా నర్సిరెడ్డి, మొహమ్మద్ నాసర్, రామిని రమేష్, శంబాల వెంకన్న, మోటే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి