Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:33 PM

రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి.

రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి.

రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి.
May 21, 2026 01:53 PM 146 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా రామన్నపేట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి జమీరుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో సమాచార సాంకేతిక రంగానికి రాజీవ్ గాంధీ పునాది వేశారని కొనియాడారు. యువత రాజకీయాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించిన దూరదృష్టి గల నాయకుడని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు.

కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కొత్తపెళ్లి అబ్రహం కుమార్, గుండాల నరసింహ, నంద్యాల భిక్షం రెడ్డి, గంగుల రాజిరెడ్డి, పున్న జగన్మోహన్, గుత్తా నర్సిరెడ్డి, మొహమ్మద్ నాసర్, రామిని రమేష్, శంబాల వెంకన్న, మోటే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News