PRINT TIME: May 26, 2026 03:04 PM
రాజేంద్రనగర్లో రేపు విత్తన మేళా. రైతులకు మెరుగైన వరి విత్తనాల అందుబాటు.
రాజేంద్రనగర్లో రేపు విత్తన మేళా. రైతులకు మెరుగైన వరి విత్తనాల అందుబాటు.
May 22, 2026 02:06 PM
159 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్,: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన సంస్థలో విత్తన మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రైతులకు వివిధ రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
విత్తన మేళాలో ఆర్ఎన్ఆర్-15048, కేఎన్ఎం-1638, బీపీటీ-5204 వంటి సన్న రకాల వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాలకు డా. వై. చంద్రమోహన్ (99085 77040), డా. శ్రీధర్ సిద్ధి (98496 35235)లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి