Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:52 PM

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు
February 23, 2026 08:10 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పది కుటుంబాలకు చెందిన పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ విషయంపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీ. హరినాథ్ తీవ్రంగా స్పందించారు. విస్సన్నపేటలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కల్తీ ఆహార పదార్థాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కల్తీ పాలు కారణంగా కుటుంబాలు వీధిన పడిన పరిస్థితి దురదృష్టకరమని, ఈ ఘటనపై సంబంధిత శాఖలు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే పరామర్శించి, సమగ్ర సహాయం అందించాలని కోరారు.

మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సహాయం సరిపోదని పేర్కొంటూ, ఆధారం కోల్పోయిన కుటుంబాలకు మరింత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.

కల్తీ పాల తయారీ, సరఫరా చేస్తున్న దుర్మార్గులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.





మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News