Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు
February 23, 2026 08:10 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పది కుటుంబాలకు చెందిన పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ విషయంపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీ. హరినాథ్ తీవ్రంగా స్పందించారు. విస్సన్నపేటలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కల్తీ ఆహార పదార్థాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కల్తీ పాలు కారణంగా కుటుంబాలు వీధిన పడిన పరిస్థితి దురదృష్టకరమని, ఈ ఘటనపై సంబంధిత శాఖలు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే పరామర్శించి, సమగ్ర సహాయం అందించాలని కోరారు.

మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సహాయం సరిపోదని పేర్కొంటూ, ఆధారం కోల్పోయిన కుటుంబాలకు మరింత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.

కల్తీ పాల తయారీ, సరఫరా చేస్తున్న దుర్మార్గులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.





మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News