రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు
రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు
GADDAM JAGANMOHAN REDDY
రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పది కుటుంబాలకు చెందిన పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ విషయంపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీ. హరినాథ్ తీవ్రంగా స్పందించారు. విస్సన్నపేటలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కల్తీ ఆహార పదార్థాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
కల్తీ పాలు కారణంగా కుటుంబాలు వీధిన పడిన పరిస్థితి దురదృష్టకరమని, ఈ ఘటనపై సంబంధిత శాఖలు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే పరామర్శించి, సమగ్ర సహాయం అందించాలని కోరారు.
మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సహాయం సరిపోదని పేర్కొంటూ, ఆధారం కోల్పోయిన కుటుంబాలకు మరింత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.
కల్తీ పాల తయారీ, సరఫరా చేస్తున్న దుర్మార్గులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి