Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:35 AM

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు
23-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పది కుటుంబాలకు చెందిన పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ విషయంపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీ. హరినాథ్ తీవ్రంగా స్పందించారు. విస్సన్నపేటలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కల్తీ ఆహార పదార్థాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కల్తీ పాలు కారణంగా కుటుంబాలు వీధిన పడిన పరిస్థితి దురదృష్టకరమని, ఈ ఘటనపై సంబంధిత శాఖలు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే పరామర్శించి, సమగ్ర సహాయం అందించాలని కోరారు.

మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సహాయం సరిపోదని పేర్కొంటూ, ఆధారం కోల్పోయిన కుటుంబాలకు మరింత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.

కల్తీ పాల తయారీ, సరఫరా చేస్తున్న దుర్మార్గులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.





Sthanikam

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు

Article Image

రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పది కుటుంబాలకు చెందిన పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ విషయంపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీ. హరినాథ్ తీవ్రంగా స్పందించారు. విస్సన్నపేటలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కల్తీ ఆహార పదార్థాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కల్తీ పాలు కారణంగా కుటుంబాలు వీధిన పడిన పరిస్థితి దురదృష్టకరమని, ఈ ఘటనపై సంబంధిత శాఖలు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే పరామర్శించి, సమగ్ర సహాయం అందించాలని కోరారు.

మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సహాయం సరిపోదని పేర్కొంటూ, ఆధారం కోల్పోయిన కుటుంబాలకు మరింత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.

కల్తీ పాల తయారీ, సరఫరా చేస్తున్న దుర్మార్గులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.





మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News