Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:16 PM

రాజకీయాల్లో నవ విప్లవం రావాలి

రాజకీయాల్లో నవ విప్లవం రావాలి

రాజకీయాల్లో నవ విప్లవం రావాలి
January 28, 2026 05:47 PM 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

యువతకు, మహిళలకు పెద్దపీటతో జాగృతి అడుగులు

కప్పాటి పాండురంగారెడ్డి పిలుపు

స్థానికం ప్రతినిధి

సమాజంలో నిజమైన మార్పు రావాలంటే సంకల్పం, సేవాభావం కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జాగృతి నాయకులు కుమ్మరి శివశంకర్, ఉండెల బాబురావుతో కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు.ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు ఉండేవని, నేటి రోజుల్లో అవి క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరం మారుతున్న కొద్దీ కొత్త ఆలోచనలు, కొత్త ఆకాంక్షలు కలిగిన యువత రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని అన్నారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పనిచేసే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించినప్పుడే భవిష్యత్ తెలంగాణకు బలమైన పునాదులు వేయగలమని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ విధానం ద్వారానే సామాజిక విప్లవం సాధ్యమని నమ్మి, కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జాగృతిని రాజకీయ వేదికగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈ నూతన ప్రస్థానంలో యువతకు పెద్దపీట వేస్తూ, మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించి, చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయాలనే కృతనిశ్చయంతో జాగృతి ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సామాజిక, రాజకీయ యజ్ఞంలో యువత పెద్దఎత్తున భాగస్వాములు కావాలని కప్పాటి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News