Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

రాజకీయాల్లో నవ విప్లవం రావాలి

రాజకీయాల్లో నవ విప్లవం రావాలి

రాజకీయాల్లో నవ విప్లవం రావాలి
January 28, 2026 05:47 PM 172 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

యువతకు, మహిళలకు పెద్దపీటతో జాగృతి అడుగులు

కప్పాటి పాండురంగారెడ్డి పిలుపు

స్థానికం ప్రతినిధి

సమాజంలో నిజమైన మార్పు రావాలంటే సంకల్పం, సేవాభావం కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జాగృతి నాయకులు కుమ్మరి శివశంకర్, ఉండెల బాబురావుతో కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు.ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు ఉండేవని, నేటి రోజుల్లో అవి క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరం మారుతున్న కొద్దీ కొత్త ఆలోచనలు, కొత్త ఆకాంక్షలు కలిగిన యువత రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని అన్నారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పనిచేసే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించినప్పుడే భవిష్యత్ తెలంగాణకు బలమైన పునాదులు వేయగలమని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ విధానం ద్వారానే సామాజిక విప్లవం సాధ్యమని నమ్మి, కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జాగృతిని రాజకీయ వేదికగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈ నూతన ప్రస్థానంలో యువతకు పెద్దపీట వేస్తూ, మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించి, చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయాలనే కృతనిశ్చయంతో జాగృతి ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సామాజిక, రాజకీయ యజ్ఞంలో యువత పెద్దఎత్తున భాగస్వాములు కావాలని కప్పాటి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News