రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!
రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!
K.RAVI
చెర్వుగట్టు శివుడి చెంత మౌనిక రమేష్ గౌడ్ దంపతుల మొక్కులు
మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌనిక రమేష్ గౌడ్ సోమవారం ఆలయాన్ని సందర్శించి స్వామివారికి అభిషేకాలు, గోత్రనామార్చనలు జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..."తెలంగాణ రాష్ట్రంలోనే పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న ఏకైక నేత రాజగోపాల్ రెడ్డి. ఆయన మంత్రి పదవి చేపడితే మునుగోడు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే పబ్బు రాజు గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించి, ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ స్వామిని వేడుకున్నారు."

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి