PRINT TIME: April 11, 2026 01:55 PM
రాజగోపాల్ రెడ్డీ దంపతులకు వినయ్ కుమార్ ఘన సన్మానం
రాజగోపాల్ రెడ్డీ దంపతులకు వినయ్ కుమార్ ఘన సన్మానం
February 24, 2026 07:49 AM
280 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
అభివృద్ధికి కట్టుబాటుగా పనిచేస్తామని హామీ
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ,ఆయన సతీమణి లక్ష్మి దంపతులను సోమవారం వారి నివాసంలో చౌటుప్పల్ పురపాలక వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
మున్సిపల్ కౌన్సిలర్గా, అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నిక కావడానికి పూర్తి సహకారం అందించినందుకు ఎమ్మెల్యే దంపతులకు వినయ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు శాలువాలు కప్పి సన్మానించారు.నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఎమ్మెల్యే నాయకత్వంలో ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గోశిక శ్రీకాంత్, బత్తుల యశ్వంత్, గంజి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి