PRINT TIME: July 11, 2026 02:37 AM
రైతులు వరికోయలకు నిప్పు పెట్టొద్దు. రామన్నపేట ఎస్ ఐ డి. నాగరాజు
రైతులు వరికోయలకు నిప్పు పెట్టొద్దు. రామన్నపేట ఎస్ ఐ డి. నాగరాజు
May 29, 2026 01:09 PM
110 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట : రైతులు ఎండిన వరికోయలకు, ఇంటి పరిసరాల్లో ఉన్న చెత్తాచెదారానికి నిప్పు పెట్టవద్దని రామన్నపేట ఎస్ ఐ డి. నాగరాజు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వీస్తున్న వేడి గాలుల కారణంగా చిన్న మంటలు కూడా వేగంగా వ్యాపించి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు.
వరికోయలకు నిప్పు పెట్టడం వల్ల మంటలు సమీపంలోని ఇండ్లు, గడ్డివాములు, వ్యవసాయ పొలాలకు వ్యాపించి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ చేతులారా ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దన్నారు.
ప్రకృతిని కాపాడితే అది మన ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్న ఆయన.. గ్రామాలను పచ్చగా, సురక్షితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇకపై ఎవరైనా వరికోయలకు నిప్పు పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్హెచ్వో డి. నాగరాజు స్పష్టం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి