రైతులు ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలి
రైతులు ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలి
Biksham
ఐకెపి కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని తహసిల్దార్ హేమలత అన్నారు. బుధవారం వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ పిల్లల సందీప్, లక్ష్మీదేవి గూడెం సర్పంచ్ ఎలికంటి భరత్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.రైతులు దళారులు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం రైతులకు ఏ రకం ధాన్యానికి 2389 రూపాయలు, సాధారణ ధాన్యం రకానికి 2369 రూపాయలు అందించి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రం సాఫీగా జరిగేటట్లు రైతులు సహకరించాలని కోరారు. రైతులు ధాన్యాన్ని తీసుకు వచ్చేటప్పుడు తేమ శాతం 17 కంటే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డిపిఎం సోమయ్య, ఎపిఎం జానకి, ఆర్ ఐ మహేందర్ రెడ్డి,ఏ ఈ ఓ రమేష్, సీసీ గోపి,ఉప సర్పంచ్లు శాలెం రాజు, గంట స్వాతి నరసయ్య, రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ఆర్గనైజింగ్ కార్యదర్శి బంటు చొక్కాయ్య గౌడ్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, ఐకెపి నిర్వాహకులు కుంచం నాగమణి, హమాలి సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి