Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నరసింహులగూడెం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి.... “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 06:35 PM

రైతులు ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలి

రైతులు ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలి

రైతులు ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలి
April 08, 2026 04:18 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఐకెపి కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని తహసిల్దార్ హేమలత అన్నారు. బుధవారం వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ పిల్లల సందీప్, లక్ష్మీదేవి గూడెం సర్పంచ్ ఎలికంటి భరత్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.రైతులు దళారులు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం రైతులకు ఏ రకం ధాన్యానికి 2389 రూపాయలు, సాధారణ ధాన్యం రకానికి 2369 రూపాయలు అందించి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రం సాఫీగా జరిగేటట్లు రైతులు సహకరించాలని కోరారు. రైతులు ధాన్యాన్ని తీసుకు వచ్చేటప్పుడు తేమ శాతం 17 కంటే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డిపిఎం సోమయ్య, ఎపిఎం జానకి, ఆర్ ఐ మహేందర్ రెడ్డి,ఏ ఈ ఓ రమేష్, సీసీ గోపి,ఉప సర్పంచ్లు శాలెం రాజు, గంట స్వాతి నరసయ్య, రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ఆర్గనైజింగ్ కార్యదర్శి బంటు చొక్కాయ్య గౌడ్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, ఐకెపి నిర్వాహకులు కుంచం నాగమణి, హమాలి సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News