రైతులందరూ తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్
రైతులందరూ తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఇప్పటివరకు మొక్కజొన్న 8000 ఎకరాలు మరియు వరి 500 ఎకరాలు సాగులో ఉన్నవని రైతులుకు అవసరమయ్యే యూరియా నిల్వలు అన్ని పిఎసిఎస్ లనందు 135 మెట్రిక్ టన్నులు మరియు ప్రైవేట్ షాపుల నందు 100 మెటెక్ టన్నులు అందుబాటులో ఉంచటం జరిగినదని రైతులు ముఖ్యంగా ఈ రబీ సీజన్ కు e పంట నందు మొక్కజొన్న వరి పంటలను నమోదు చేయించుకొనవలెనని e పంట నమోదు అత్యంత ఆవశ్యకత కలిగి ఉన్నదని రైతులు మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రాల వద్ద సహాయ వ్యవసాయ అధికారి విఏఏ లేదా వీహెచ్ఏ లను కలసి మీ సర్వేనెంబర్ ఆధార్ నెంబర్లతో e పంట నందు నమోదు చేసుకోవలెనని e పంట నమోదు ద్వారా రైతులకు ప్రభుత్వం కల్పించే గరిష్ట మద్దతు ధర ఎంఎస్పి లభిస్తుందని ధాన్యం కొనుగోలు పంట నష్టపరిహారం సీసీఆర్సీ కార్డులు పంట రుణాలు రైతుగా గుర్తింపు పొందిన వారికి విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చునని కావున రైతులు అందరూ మీ గ్రామంలోని ఆర్ఎస్కే లను సంప్రదించి e పంట నమోదు చేయించుకొనవలెనని మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ తెలియజేశారు ఈరోజు చాట్రాయి మండలంలో చాట్రాయి గ్రామమునందు e పంట నమోదును పరిశీలించటం జరిగినదని తెలియజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి