రైతులే స్వయంగా e పంట నమోదు
రైతులే స్వయంగా e పంట నమోదు
GADDAM JAGANMOHAN REDDY
రైతులు వారి మొబైల్ ఫోన్ లో APAIMS 2.0 (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్) యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని 4 అంకెల MPIN సెట్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఆధారంగా వెబ్ ల్యాండ్ తో అనుసంధాన మైన రైతుకు చెందిన అన్ని భూ కమతాలు ఆ యాప్ లో కనిపిస్తాయి రైతు సేవా కేంద్ర సిబ్బంది నమోదు చేయని భూములు రైతులు పంట నమోదు చేసుకొనుటకు యాప్ లో కనిపిస్తాయి. పంట నమోదు సమయంలో 20 మీటర్ల జియో రిఫరెన్సు హద్దులతో కూడిన పొలంలో ఉంటేనే పంట నమోదు అవుతుంది ఇలా నమోదు చేసిన సమాచారం సంబంధిత RSK సిబ్బందికి ధృవీకరణకు వెళ్తుంది. అంతేకాక ఈ యాప్ లో రైతు సేవా కేంద్ర సిబ్బంది నమోదు చెందిన వివరాలు సరిగా ఉన్నాయో లేదో కూడా పరిశీలించుకో వచ్చును. వివరాలు సరిగా లేకపోతే రైతులు ఫిర్యాదు చేసే అవకాశం కూడా రైతులకు కల్పించారని తిరువూరు మండల వ్యవసాయ అధికారి పి పద్మ తెలియచేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి