రైతులతో టీడీపీ నాయకుల ముఖాముఖి కార్యక్రమం
రైతులతో టీడీపీ నాయకుల ముఖాముఖి కార్యక్రమం
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామంలో సోమవారం టీడీపీ నాయకులు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల టీడీపీ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.2,000, పీఎం కిసాన్ పథకం కింద రూ.4,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విద్యాధరణి, టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి, టీడీపీ జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లల చెరువు చంద్ర, బీజేపీ–జనసేన నాయకులు సంతోష్, లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రవికుమార్ నాయక్, వెంకట రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ నరేష్ కుమార్ యాదవ్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి