Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:50 PM

రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమం

రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమం

రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమం
February 04, 2026 06:50 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

చీడపీడల నివారణపై కీలక సూచనలు

కూసుమంచి:

కూసుమంచి మండలంలోని పలు గ్రామాలలో వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించి రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. స్థానిక వ్యవసాయ అధికారి కూసుమంచి జనార్దన్ రావు నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని తగిన సూచనలు చేశారు.కూసుమంచి మండలంలోని మల్లేపల్లి గ్రామంలో వరి పొలాలను కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటలకు వచ్చే చీడపీడలు, వాటి నివారణ పద్ధతులు, తగిన మందుల వినియోగంపై అవగాహన కల్పించారు. పంట స్థితిని బట్టి సమయానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం కిశ్రాపురం గ్రామంలో నిర్వహించిన రైతుల సమావేశంలో రైతు నమోదు ప్రక్రియ, యూరియా బుకింగ్ విధానం, పంట నమోదు ప్రాధాన్యతపై స్పష్టంగా వివరించారు. రైతులు తప్పనిసరిగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వ సహాయ పథకాలు సులభంగా అందుతాయని తెలిపారు.తదుపరి కిష్టాపురం గ్రామంలో పంట పొలాలను పరిశీలించి రైతులకు వ్యక్తిగతంగా సలహాలు ఇచ్చారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలలో జింకులోపం కనిపిస్తున్నట్లు గుర్తించి, జింక చలిపేట గ్రామాన్ని పిచికారీ చేసుకోవాలని సూచించారు. పంట ఆరోగ్యం కాపాడుకోవాలంటే పోషక లోపాలను వెంటనే సరిచేయాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ బాబా, వంశీకృష్ణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News