Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:47 PM

రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమం

రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమం

రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమం
February 04, 2026 06:50 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

చీడపీడల నివారణపై కీలక సూచనలు

కూసుమంచి:

కూసుమంచి మండలంలోని పలు గ్రామాలలో వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించి రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. స్థానిక వ్యవసాయ అధికారి కూసుమంచి జనార్దన్ రావు నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని తగిన సూచనలు చేశారు.కూసుమంచి మండలంలోని మల్లేపల్లి గ్రామంలో వరి పొలాలను కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటలకు వచ్చే చీడపీడలు, వాటి నివారణ పద్ధతులు, తగిన మందుల వినియోగంపై అవగాహన కల్పించారు. పంట స్థితిని బట్టి సమయానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం కిశ్రాపురం గ్రామంలో నిర్వహించిన రైతుల సమావేశంలో రైతు నమోదు ప్రక్రియ, యూరియా బుకింగ్ విధానం, పంట నమోదు ప్రాధాన్యతపై స్పష్టంగా వివరించారు. రైతులు తప్పనిసరిగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వ సహాయ పథకాలు సులభంగా అందుతాయని తెలిపారు.తదుపరి కిష్టాపురం గ్రామంలో పంట పొలాలను పరిశీలించి రైతులకు వ్యక్తిగతంగా సలహాలు ఇచ్చారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలలో జింకులోపం కనిపిస్తున్నట్లు గుర్తించి, జింక చలిపేట గ్రామాన్ని పిచికారీ చేసుకోవాలని సూచించారు. పంట ఆరోగ్యం కాపాడుకోవాలంటే పోషక లోపాలను వెంటనే సరిచేయాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ బాబా, వంశీకృష్ణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News