రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అధికారులకు ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం
రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అధికారులకు ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం
Editor Desk
28లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.
కేతపల్లి, నకిరేకల్, కట్టంగూర్ మండలాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 28వ తేదీలోపు పూర్తిచేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు.
నకిరేకల్ ఎంఆర్వో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మూడు మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంపై అధికారులతో చర్చించారు. మొత్తం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 23 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన అన్ని కేంద్రాల్లో కూడా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, మార్కెట్ చైర్పర్సన్ గుత్తా మంజుల, మాధవ్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి