Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:56 AM

రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అధికారులకు ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం

రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అధికారులకు ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం

రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అధికారులకు ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం
May 24, 2026 06:42 PM 176 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

28లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.

కేతపల్లి, నకిరేకల్‌, కట్టంగూర్ మండలాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 28వ తేదీలోపు పూర్తిచేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్‌ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు.

నకిరేకల్‌ ఎంఆర్వో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మూడు మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంపై అధికారులతో చర్చించారు. మొత్తం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 23 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన అన్ని కేంద్రాల్లో కూడా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, మార్కెట్ చైర్‌పర్సన్ గుత్తా మంజుల, మాధవ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News