రైతులకు భారీ ఊరట – 3,600 కోట్లు ఖాతాల్లో జమ
రైతులకు భారీ ఊరట – 3,600 కోట్లు ఖాతాల్లో జమ
Krishna
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించిన ‘రైతు భరోసా’ నిధుల విడుదల కార్యక్రమం ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయంగా రూ. 3,600 కోట్ల నిధులను నేరుగా జమ చేశారు.ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో ఆనందం వెల్లివిరిసింది. సాగు ఖర్చులకు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయం బలోపేతం చేయడం, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.అదేవిధంగా, వచ్చే 45 రోజుల్లోగా మొత్తం రూ. 9,000 కోట్ల నిధులను రైతులందరి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో రైతులకు నిరంతర సహాయం అందించాలన్న ప్రభుత్వ సంకల్పం మరింత స్పష్టమైంది.ఈ కార్యక్రమం అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి సహచర ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, రైతులకు అందిస్తున్న సహాయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు రైతాంగానికి పెద్ద భరోసాగా నిలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి