PRINT TIME: April 09, 2026 03:09 PM
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎలికంటి భరత్
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎలికంటి భరత్
April 09, 2026 01:48 PM
2 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లక్ష్మీదేవిగూడెం సర్పంచ్ ఎలికంటి భరత్ పేర్కొన్నారు. లక్ష్మీదేవిగూడెం పీఏసీఎస్ సల్కునూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సహకార మానిటరింగ్ అధికారి రజితతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందేందుకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి వారి పంటలకు న్యాయమైన ధర అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి నర్సయ్య, సెక్రటరీ వాకిటి నరేష్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి