Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:56 PM

రైతుల శ్రమ తగ్గించడమే లక్ష్యంగా వ్యవసాయ యాంత్రికరణ పథకం అమలు

రైతుల శ్రమ తగ్గించడమే లక్ష్యంగా వ్యవసాయ యాంత్రికరణ పథకం అమలు

రైతుల శ్రమ తగ్గించడమే లక్ష్యంగా వ్యవసాయ యాంత్రికరణ పథకం అమలు
January 20, 2026 05:58 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ అధికార కార్యాలయంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రికరణ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల శ్రమను తగ్గించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్న వ్యవసాయ పనిముట్లు నాణ్యమైనవని, ఎక్కువకాలం ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పారు. ప్రతి రైతు కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొత్తం 109 వ్యవసాయ పనిముట్లు మంజూరు కాగా, వాటిలో కల్టివేటర్లు 21, స్ప్రేయర్లు 77, బ్రష్ కట్టర్లు 3, పవర్ విడర్లు 1, రోటవేటర్లు 4, విత్తనాలు మరియు ఎరువులు వేసే డ్రిల్ 1, ధాన్యాన్ని కట్టే యంత్రం 1 ఉన్నాయి. ఈ పనిముట్ల పంపిణీతో నియోజకవర్గంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నూతన్ కుమార్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు దారం శంకర్ సెట్, రైతులు మరియు ఇతర ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News