Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:52 AM

రైతుల శ్రమ తగ్గించడమే లక్ష్యంగా వ్యవసాయ యాంత్రికరణ పథకం అమలు

రైతుల శ్రమ తగ్గించడమే లక్ష్యంగా వ్యవసాయ యాంత్రికరణ పథకం అమలు

రైతుల శ్రమ తగ్గించడమే లక్ష్యంగా వ్యవసాయ యాంత్రికరణ పథకం అమలు
20-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ అధికార కార్యాలయంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రికరణ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల శ్రమను తగ్గించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్న వ్యవసాయ పనిముట్లు నాణ్యమైనవని, ఎక్కువకాలం ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పారు. ప్రతి రైతు కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొత్తం 109 వ్యవసాయ పనిముట్లు మంజూరు కాగా, వాటిలో కల్టివేటర్లు 21, స్ప్రేయర్లు 77, బ్రష్ కట్టర్లు 3, పవర్ విడర్లు 1, రోటవేటర్లు 4, విత్తనాలు మరియు ఎరువులు వేసే డ్రిల్ 1, ధాన్యాన్ని కట్టే యంత్రం 1 ఉన్నాయి. ఈ పనిముట్ల పంపిణీతో నియోజకవర్గంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నూతన్ కుమార్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు దారం శంకర్ సెట్, రైతులు మరియు ఇతర ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

రైతుల శ్రమ తగ్గించడమే లక్ష్యంగా వ్యవసాయ యాంత్రికరణ పథకం అమలు

Article Image

ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ అధికార కార్యాలయంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రికరణ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల శ్రమను తగ్గించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్న వ్యవసాయ పనిముట్లు నాణ్యమైనవని, ఎక్కువకాలం ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పారు. ప్రతి రైతు కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొత్తం 109 వ్యవసాయ పనిముట్లు మంజూరు కాగా, వాటిలో కల్టివేటర్లు 21, స్ప్రేయర్లు 77, బ్రష్ కట్టర్లు 3, పవర్ విడర్లు 1, రోటవేటర్లు 4, విత్తనాలు మరియు ఎరువులు వేసే డ్రిల్ 1, ధాన్యాన్ని కట్టే యంత్రం 1 ఉన్నాయి. ఈ పనిముట్ల పంపిణీతో నియోజకవర్గంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నూతన్ కుమార్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు దారం శంకర్ సెట్, రైతులు మరియు ఇతర ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News