రైతుల సమస్యలు పరిష్కరించాలి. తాసిల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
రైతుల సమస్యలు పరిష్కరించాలి. తాసిల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
Editor Desk
: రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్వో కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంఆర్వోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన” అంటూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వైయంతి, సుర్వి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుత భాస్కర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నపురం శ్రీశైలం, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాలశంకర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జనగాం కవిత, బెజ్జెంకి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి