Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేశంలో కుల వివక్ష లేని సమాజం నిర్మించాలి. ‘ఇండియా @ 80’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి: బెజవాడ విల్సన్ డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 07:15 PM

రైతుల కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది

రైతుల కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది

రైతుల కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది
May 14, 2026 05:47 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మద్దతు ధర పెంపుపై ప్రధానికి రామన్నపేట లో పాలాభిషేకం

రామన్నపేట,

రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచిన సందర్భంగా రామన్నపేట పట్టణంలోని సుభాష్ సెంటర్‌లో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు.

ఈ సందర్భంగా నకిరేకల్ ఇన్‌చార్జ్ నకిరేకంటి మొగులయ్య, బండ మధుకర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు దుర్గయ్య మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులకు లాభసాటి వ్యవసాయం అందించేందుకు పసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలు, సోలార్ పంపుసెట్లకు 80 శాతం సబ్సిడీ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నష్టపరుస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.

కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, బీజేపీ నాయకులు డోగుపర్తి సుభాష్, కట్ట యాదయ్య, బీజేవైఎం జిల్లా కార్యదర్శి అక్కినపల్లి సైదులు, బెజ్జంకి శివకుమార్, బట్టే రమేష్, బతక్క నరేష్, రేపాక లింగస్వామి, గోపగోని అశోక్, రేఖ నరసింహ, పండుగ అశోక్, సురివి శేఖర్, ఏనూతుల సురేష్, చేరుకు గణేష్, మెడబోయిన కృష్ణ, అక్కెనపల్లి రాము, గొరిగే సైదులు, ఎర్రబోయిన వెంకటేష్, మెడబోయిన ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News