Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:56 AM

రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం

రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం

రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం
18-05-2026 169 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట : రైతులు తీసుకొచ్చే ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్, వేముల వీరేశం హామీ ఇచ్చారు. రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్ల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తూకం, రవాణా, హమాలి తదితర ప్రక్రియలను వేగవంతం చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.

మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు సహకరించాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, రైతులకు చెల్లింపులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో తాసిల్దార్ లాల్ బహుదూర్, ఎంపీడీవో రాములు,

అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం

Article Image

రామన్నపేట : రైతులు తీసుకొచ్చే ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్, వేముల వీరేశం హామీ ఇచ్చారు. రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్ల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తూకం, రవాణా, హమాలి తదితర ప్రక్రియలను వేగవంతం చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.

మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు సహకరించాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, రైతులకు చెల్లింపులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో తాసిల్దార్ లాల్ బహుదూర్, ఎంపీడీవో రాములు,

అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News