Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:33 PM

రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం

రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం

రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం
May 18, 2026 04:23 PM 149 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట : రైతులు తీసుకొచ్చే ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్, వేముల వీరేశం హామీ ఇచ్చారు. రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్ల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తూకం, రవాణా, హమాలి తదితర ప్రక్రియలను వేగవంతం చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.

మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు సహకరించాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, రైతులకు చెల్లింపులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో తాసిల్దార్ లాల్ బహుదూర్, ఎంపీడీవో రాములు,

అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News