రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం
రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం
Editor Desk
రామన్నపేట : రైతులు తీసుకొచ్చే ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్, వేముల వీరేశం హామీ ఇచ్చారు. రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్ల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తూకం, రవాణా, హమాలి తదితర ప్రక్రియలను వేగవంతం చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.
మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు సహకరించాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, రైతులకు చెల్లింపులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో తాసిల్దార్ లాల్ బహుదూర్, ఎంపీడీవో రాములు,
అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి