Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:03 AM

రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం

రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం

రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం
May 18, 2026 04:23 PM 166 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట : రైతులు తీసుకొచ్చే ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్, వేముల వీరేశం హామీ ఇచ్చారు. రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్ల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తూకం, రవాణా, హమాలి తదితర ప్రక్రియలను వేగవంతం చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.

మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు సహకరించాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, రైతులకు చెల్లింపులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో తాసిల్దార్ లాల్ బహుదూర్, ఎంపీడీవో రాములు,

అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News