Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోదాస్ ఐలయ్య కుమార్తె నిశ్చితార్థంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 13, 2026 05:58 PM

రైతు ముంగిట శాస్త్రవేత్తల సూచనలు

రైతు ముంగిట శాస్త్రవేత్తల సూచనలు

రైతు ముంగిట శాస్త్రవేత్తల సూచనలు
May 13, 2026 04:35 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సన్నరకాల వరి సాగుతో అధిక లాభాలు.. నానో యూరియా వినియోగంపై అవగాహన

చౌటుప్పల్ మండలంలోని రైతు వేదికలో బుధవారం “రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డా.ప్రభావతి పాల్గొని వచ్చే వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటల యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వరిలో బీపీటీ –5204,ఆర్ఎన్ఆర్ –15048,కెఎన్ఎమ్–1638, డబ్ల్యుజిఎల్ –44 (సిద్ధి),హెచ్ ఎం టి సోనా, జైశ్రీరామ్ వంటి సన్నధాన్య రకాలను సాగు చేస్తే అధిక దిగుబడితో పాటు ప్రభుత్వం అందించే క్వింటాకు రూ.500 బోనస్ పొందవచ్చన్నారు. అలాగే ఎం టి యు –1010, కె ఎన్ ఎం –118 వంటి దొడ్డు రకాల సాగుతో గ్రేడ్–ఏ మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. యూరియా వినియోగాన్ని తగ్గించి నానో యూరియా వాడాలని, ఎకరాకు రెండు బస్తాలకు మించి యూరియా వేయొద్దని సూచించారు.వరి పంటలో కాండం తొలిచే పురుగు నివారణకు నాట్లు వేసే వారం రోజుల ముందు ఒక సెంట్ నారుమడికి 2 కిలోల కార్బోఫ్యూరాన్ 4జి గుళికలు వేయాలని తెలిపారు. అలాగే నాటు వేసిన 15 రోజులకు ఒకసారి పురుగుమందు పిచికారీ చేస్తే మొగి పురుగు నివారణ సాధ్యమవుతుందన్నారు. దోమపోటు నివారణకు కాళిబాటలు తప్పనిసరిగా తీయాలని సూచించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు విత్తనాలు, ఎరువులు వినియోగించాలని రైతులకు సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడితే సాగు ఖర్చు తగ్గి అధిక దిగుబడులు సాధ్యమవుతాయన్నారు.

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వైస్ చైర్మన్ చేన్నాగోని అంజయ్య శాస్త్ర వేత్తల సలహాలు, సూచనలు పాటించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి,పొల్లేపల్లి లక్ష్మీ,రెడ్డి బావి సర్పంచ్ నందగిరి వెంకట్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News