Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:54 AM

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి
April 06, 2026 08:46 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
  1. రైతు సంఘం పట్టణ అధ్యక్షులు కార్యదర్శిని ఏకగ్రీవంగా ఎన్నిక
  2. రైతు సంఘం పట్టణ అధ్యక్షులుగా బర్ల వెంకటేష్,కార్యదర్శిగా బందెల ఎల్లయ్య ఎన్ని

భువనగిరి:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ ఆదివారం భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక సింగన్నగూడెంలో రైతు సంఘం భువనగిరి పట్టణ ప్రథమ మహాసభ రైతు సంఘం సీనియర్ నాయకులు కొలుపుల కృష్ణ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని,రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మోసం చేసిందనిన్నారు.రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కాలేదని అన్నారు. కొత్త కొత్త యాపులను తీసుకువచ్చి యూరియా రైతులకు అందించే విషయంలో గందరగోళాన్ని సృష్టించి యూరియా అందించే పరిస్థితి లేదని అన్నారు. గత ప్రభుత్వాలు ఏకకాలంలో రైతు బందును విడుదల చేసేదని అన్నారు.ఈ ప్రభుత్వం అలా చేయకుండా విడతల వారీగా విడుదల చేస్తుందనిన్నారు. ఈ వచ్చే వరి పంటకు కనీస మద్దతు ధర కల్పించి రైతులు ఆదుకోవాలని అన్నారు. రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలని,జిల్లాలోని రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.ఈ మహాసభలో 11మందితో పట్టణ కమిటీ ఎన్నిక కాగా రైతు సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా బర్ల వెంకటేష్,బందెల ఎల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ,రైతు సంఘం నాయకులు బందెల ఎల్లయ్య,పోకల దయానంద్,ఊదరి బాలరాజు,ఎనబోయిన లింగమూర్తి,నరాల నరసింహ,ఊదరికృష్ణ,బండి రవి,బండి వెంకటేష్,మేడబోయిన జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News