Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆహార నాణ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్ గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 10:48 PM

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి
April 06, 2026 08:46 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
  1. రైతు సంఘం పట్టణ అధ్యక్షులు కార్యదర్శిని ఏకగ్రీవంగా ఎన్నిక
  2. రైతు సంఘం పట్టణ అధ్యక్షులుగా బర్ల వెంకటేష్,కార్యదర్శిగా బందెల ఎల్లయ్య ఎన్ని

భువనగిరి:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ ఆదివారం భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక సింగన్నగూడెంలో రైతు సంఘం భువనగిరి పట్టణ ప్రథమ మహాసభ రైతు సంఘం సీనియర్ నాయకులు కొలుపుల కృష్ణ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని,రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మోసం చేసిందనిన్నారు.రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కాలేదని అన్నారు. కొత్త కొత్త యాపులను తీసుకువచ్చి యూరియా రైతులకు అందించే విషయంలో గందరగోళాన్ని సృష్టించి యూరియా అందించే పరిస్థితి లేదని అన్నారు. గత ప్రభుత్వాలు ఏకకాలంలో రైతు బందును విడుదల చేసేదని అన్నారు.ఈ ప్రభుత్వం అలా చేయకుండా విడతల వారీగా విడుదల చేస్తుందనిన్నారు. ఈ వచ్చే వరి పంటకు కనీస మద్దతు ధర కల్పించి రైతులు ఆదుకోవాలని అన్నారు. రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలని,జిల్లాలోని రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.ఈ మహాసభలో 11మందితో పట్టణ కమిటీ ఎన్నిక కాగా రైతు సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా బర్ల వెంకటేష్,బందెల ఎల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ,రైతు సంఘం నాయకులు బందెల ఎల్లయ్య,పోకల దయానంద్,ఊదరి బాలరాజు,ఎనబోయిన లింగమూర్తి,నరాల నరసింహ,ఊదరికృష్ణ,బండి రవి,బండి వెంకటేష్,మేడబోయిన జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News