Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.సర్పంచ్ కంచి మధుసూదన్ TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 06:54 PM

రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..
March 26, 2026 05:06 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా, జె సి కి వినతిపత్రం అందజేత..

నల్లగొండ:జిల్లాలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. గురువారం నల్లగొండ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని పెండింగ్‌లో ఉన్న బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఏప్రిల్ నెలలోనే వరి కోతలు ప్రారంభం కానున్నందున రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే ఐకేపీ (IKP) సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

​పెండింగ్‌లో ఉన్న బోనస్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని జిల్లాలో సాగు చేస్తున్న పామాయిల్ రైతుల ప్రయోజనం కోసం ఫ్యాక్టరీ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే VB G RAM G పథకాన్ని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, సెంట్రల్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదగోని శ్రీనివాస్ గౌడ్, భూ నిర్వాసితుల సెల్ కన్వీనర్ భవనం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, కోశాధికారి కన్మత రెడ్డి అశోక్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, అధ్యక్షులు మిరియాల వెంకటేశం, నాయకులు బీపంగి జగ్జీవన్, పిండి పాపిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, సీనియర్ నాయకురాలు ఇరిగి చిలకమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News