Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ సభలో కలకలం.. సీఎం స్టేజీపై రాజకీయ రగడ! రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 29, 2026 09:49 AM

రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..
March 26, 2026 05:06 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా, జె సి కి వినతిపత్రం అందజేత..

నల్లగొండ:జిల్లాలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. గురువారం నల్లగొండ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని పెండింగ్‌లో ఉన్న బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఏప్రిల్ నెలలోనే వరి కోతలు ప్రారంభం కానున్నందున రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే ఐకేపీ (IKP) సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

​పెండింగ్‌లో ఉన్న బోనస్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని జిల్లాలో సాగు చేస్తున్న పామాయిల్ రైతుల ప్రయోజనం కోసం ఫ్యాక్టరీ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే VB G RAM G పథకాన్ని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, సెంట్రల్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదగోని శ్రీనివాస్ గౌడ్, భూ నిర్వాసితుల సెల్ కన్వీనర్ భవనం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, కోశాధికారి కన్మత రెడ్డి అశోక్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, అధ్యక్షులు మిరియాల వెంకటేశం, నాయకులు బీపంగి జగ్జీవన్, పిండి పాపిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, సీనియర్ నాయకురాలు ఇరిగి చిలకమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News