రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..
రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..
NM Yadav
కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా, జె సి కి వినతిపత్రం అందజేత..
నల్లగొండ:జిల్లాలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. గురువారం నల్లగొండ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని పెండింగ్లో ఉన్న బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఏప్రిల్ నెలలోనే వరి కోతలు ప్రారంభం కానున్నందున రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే ఐకేపీ (IKP) సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న బోనస్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని జిల్లాలో సాగు చేస్తున్న పామాయిల్ రైతుల ప్రయోజనం కోసం ఫ్యాక్టరీ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే VB G RAM G పథకాన్ని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, సెంట్రల్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదగోని శ్రీనివాస్ గౌడ్, భూ నిర్వాసితుల సెల్ కన్వీనర్ భవనం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, కోశాధికారి కన్మత రెడ్డి అశోక్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, అధ్యక్షులు మిరియాల వెంకటేశం, నాయకులు బీపంగి జగ్జీవన్, పిండి పాపిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, సీనియర్ నాయకురాలు ఇరిగి చిలకమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి