PRINT TIME: February 23, 2026 10:22 PM
రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్
రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్
February 16, 2026 12:19 PM
393 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
రామన్నపేట మండలంలోని వెల్లంకి నుంచి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై పెరిగిపోయిన కంపచెట్లను తొలగిస్తూ గ్రామ సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షణలో పరిశుభ్రత పనులు చేపట్టారు. రహదారికి ఇరువైపులా విస్తరించిన కంపచెట్లు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టడం విశేషం.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి నలువైపులా ఉన్న అన్ని రోడ్ల పక్కన పెరిగిన కంపచెట్లను పూర్తిగా తొలగించి రహదారులను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో ఎక్కడైనా రోడ్లపై చెట్లు పడిపోయినా, చెత్తాచెదారం పేరుకుపోయినా వెంటనే జెసిబి సహాయంతో తొలగించాలని గ్రామపంచాయతీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి