Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:52 PM

రహదారి భద్రతే జీవితానికి రక్షణ

రహదారి భద్రతే జీవితానికి రక్షణ

రహదారి భద్రతే జీవితానికి రక్షణ
March 25, 2026 05:49 PM 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వాహనదారులకు లయన్స్ క్లబ్ అవగాహన – ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి

రహదారిపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తన ప్రాణాలను కాపాడుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షుడు తిరందాసు జగన్నాథం సూచించారు. బుధవారం పురపాలక కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు, సైదిరెడ్డి పాల్గొని వాహనదారులకు పలు సూచనలు చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని, నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని తెలిపారు. మలుపుల వద్ద వేగం తగ్గించాలని సూచించారు. మద్యపానం చేసి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం చేయరాదని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా శాఖలకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎండి అతహర్ పాషా, కోశాధికారి సిలివేరు మంగయ్య, ట్రాఫిక్ కానిస్టేబుల్ జగన్, హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News