Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:08 AM

రహదారి భద్రతే జీవితానికి రక్షణ

రహదారి భద్రతే జీవితానికి రక్షణ

రహదారి భద్రతే జీవితానికి రక్షణ
25-03-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వాహనదారులకు లయన్స్ క్లబ్ అవగాహన – ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి

రహదారిపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తన ప్రాణాలను కాపాడుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షుడు తిరందాసు జగన్నాథం సూచించారు. బుధవారం పురపాలక కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు, సైదిరెడ్డి పాల్గొని వాహనదారులకు పలు సూచనలు చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని, నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని తెలిపారు. మలుపుల వద్ద వేగం తగ్గించాలని సూచించారు. మద్యపానం చేసి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం చేయరాదని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా శాఖలకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎండి అతహర్ పాషా, కోశాధికారి సిలివేరు మంగయ్య, ట్రాఫిక్ కానిస్టేబుల్ జగన్, హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రహదారి భద్రతే జీవితానికి రక్షణ

Article Image

వాహనదారులకు లయన్స్ క్లబ్ అవగాహన – ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి

రహదారిపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తన ప్రాణాలను కాపాడుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షుడు తిరందాసు జగన్నాథం సూచించారు. బుధవారం పురపాలక కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు, సైదిరెడ్డి పాల్గొని వాహనదారులకు పలు సూచనలు చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని, నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని తెలిపారు. మలుపుల వద్ద వేగం తగ్గించాలని సూచించారు. మద్యపానం చేసి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం చేయరాదని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా శాఖలకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎండి అతహర్ పాషా, కోశాధికారి సిలివేరు మంగయ్య, ట్రాఫిక్ కానిస్టేబుల్ జగన్, హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News