రెండో విడత పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ హనుమంతరావు
రెండో విడత పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ హనుమంతరావు
Editor Desk
ఐదు మండలాల్లో ఐదు ఆదర్శ పోలింగ్ కేంద్రాలు
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. భువనగిరి, వలిగొండ, బీబీనగర్, పోచంపల్లి, రామన్నపేట మండలాల్లో పోలింగ్ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ బయట అభ్యర్థుల గుర్తులతో కూడిన ఫారం–9ను తప్పనిసరిగా అతికించాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్ను సక్రమంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ ప్రక్రియను రేపు ఉదయం 7 గంటలకే ప్రారంభించాలన్నారు.
జిల్లాలో భువనగిరి మండలం అనంతారం, బీబీనగర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, పోచంపల్లి మండలం జలాల్పూర్, వలిగొండ మండలం టేకుల సోమారం, రామన్నపేట మండలం నేర్నెముల గ్రామాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
పోలింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా ఓటింగ్లో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్ డిఓ సురేష్ తాసిల్దార్ లాల్ బహుదూర్ ఆర్ ఐ శోభ, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి,జిపిఓ లక్ష్మీదేవి, గ్రామపంచాయతీ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి