Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:39 PM

రెండో విడత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ హనుమంతరావు

రెండో విడత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ హనుమంతరావు

రెండో విడత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్  హనుమంతరావు
December 13, 2025 08:45 PM 156 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఐదు మండలాల్లో ఐదు ఆదర్శ పోలింగ్ కేంద్రాలు


స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. భువనగిరి, వలిగొండ, బీబీనగర్‌, పోచంపల్లి, రామన్నపేట మండలాల్లో పోలింగ్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్‌ బయట అభ్యర్థుల గుర్తులతో కూడిన ఫారం–9ను తప్పనిసరిగా అతికించాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్‌ను సక్రమంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ ప్రక్రియను రేపు ఉదయం 7 గంటలకే ప్రారంభించాలన్నారు.

జిల్లాలో భువనగిరి మండలం అనంతారం, బీబీనగర్‌ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, పోచంపల్లి మండలం జలాల్పూర్‌, వలిగొండ మండలం టేకుల సోమారం, రామన్నపేట మండలం నేర్నెముల గ్రామాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.


పోలింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా ఓటింగ్‌లో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్ డిఓ సురేష్ తాసిల్దార్ లాల్ బహుదూర్‌ ఆర్ ఐ శోభ, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి,జిపిఓ లక్ష్మీదేవి, గ్రామపంచాయతీ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News